22, ఆగస్టు 2017, మంగళవారం

SRIMADBHAGAVATHAMU 10THCANTO One CLARIFICATIOn



        సోదరబృందానికి వక గమనిక
     
        జ్యోతిష శాస్త్రము పరిచయమున్నవారికి మాస్టరుగారి వక సూచన
        వక జాతకము పరిశీలించునపుడు ,సర్వసామాన్యమయిన శుభాశుభములుకాక ,           విశేషములను గమనించినచో వక చిత్రమయిన విషయము కనపడును

 జా తకముననుసరించి  జరుగవలసిన అశుభములుగాని ,కష్టములుగాని, జాతకుని ప్రయత్నము  లేకుండా  తమఅంత తాముగా జరిగిపోవుచుండును. శుభములు జరుగవలసిన కాలములో మాత్రమూ  ఏయే శుభములు జరుగుటకు అవకాశమున్నదో అవి మాత్రమే జాతకము వలన స్పష్టముగా చెప్పవచ్చును . అట్టి శుభములు జరిగితీరునని చెప్పుటకు వీలులేదు. అవకాశమున్నది అని మాత్రమే చెప్పవచ్చును.  శుభము జరుగుటకు అనుకూలమయిన గ్రహస్థితి ,జాతకుని ఉత్సాహ బలము,చుట్టుప్రక్కల సామాజిక పరిస్థితులు అనుకూలముగా
ఉండునని మాత్రమే చెప్పగలరు. వానినుపయోగించుకొని జాతకుడు  తన శుభమును
"సాధించుకొనవలయును". వసుదేవుడు అందుకే తన ప్రయత్నముగా కంసుని వప్పించి
తన భార్యను రక్షించుకొనెను. తనకు మంచే జరుగునని  తెలిసిగూడా ఊరక కూరుచుండలేదు.
ఈ difference జాగ్రత్తగా గమనించాలి.
కృష్ణం వందే జగద్గురుమ్ !
MASTER CVV NAMASKARAMS!
     
 
      

18, ఆగస్టు 2017, శుక్రవారం



   
      చిరంజీవి లక్ష్మి కి ,ఆశీర్వదించి ,

   

        మీ అమ్మాయిని గురించి నీకు ఎలాంటి అనుమానము అక్కర్లేదు. ఈసంవత్సరం
      అక్టోబర్ 17 నుండి 2019 ఉగాది వరకు కల్యాణ యోగము ఉన్నది . ఈ  TIME  లో మీ ప్రయత్నాలు గట్టిగా  చేయాలి.  ఫలితాన్ని మటుకు కాలమును నమ్ముకొండి . కాలము అమ్మవారి
ప్రణాళిక . దుర్గాష్టకమును రోజూ చదువుకొంటే మంచిది. అవకాశము వున్నప్పుడు          ఈశ్వరాభి షేకము  చేయించుకోండి.శని దోషము అని  ఎవరైనా అంటే భయపడకండి.
ఇక చదువులో ,మంచి రాంక్ తో PASS అవుతుంది.జనవరి 2018 లో ఆరోగ్యము జాగర్తగా చూచుకోవాలి . డ్రైవింగ్ ఆనెలలో అవాయిడ్  చేస్తే మంచిది .
ఈ  సమాచారం నీ దగ్గరే ఉంచుకో.






.






16, ఆగస్టు 2017, బుధవారం

SRIMADBHAGAVATHAMU 10THCANTO(6CONTD)




       శ్రీమద్భాగవతము  10వ SCANDAMU (6COND )


జరగనున్నది తెలిసి, పైగా అది దైవనిర్ణయమని కూడా తెలిసినప్పుడు తానేమి చేయవలెను?
అష్టమ గర్భము కంసుని చంపుట దైవనిర్ణయము కనుక చేయవలసినదేదో దైవమే చేయునని 
చేతులు ముడుచుకొని కూరుచుండుటయా ?అట్లయిన కంసుడు దేవకిని చంపచూచినపుడు 
వసుదేవుడు నిర్ణయమును దైవమునకు వదిలి కూర్చుని ఉండ  వచ్చునుగదా ?కానీ ,వసుదేవుడు అట్లా చేయలేదు.{ తన కర్తవ్యాన్ని (మానవప్రయత్నము బుద్ధిని వాడి ) నిర్వర్తించాడు. కంసుని వప్పించి భార్యను విడిపించుకొంటాడు. }
అష్టమ గర్భమున పుట్టవలెనన్న దేవకీ బతికి ఉండవలెను. కనుక,కంసునితో, పుట్టిన ప్రతివానిని తనకిచ్చెదనని తెలిపి ,వసుదేవుడు తన భార్యను రక్షించుకొనెను . 
దైవ నిర్ణయములు కూడా చాలావరకు మానవులద్వారానే జరగవలసియుండును . అనగా దైవ సంకల్పము అనుసరించి మానవుని బుద్ధి పనిచేయవలెను. మానవుని బుద్ధి సహకరించకపోయినను, దైవసంకల్పము ఏదోవొక విధముగా కార్యరూపము ధరించును. 
కానీ అట్టి సందర్భములలో మానవుడు మాత్రమూ అప్రయోజకుడై అధోగతిపాలగును. 
జరగవలసింది జరిగి తీరునని నిష్క్రియాపరులై జీవించువారు లక్షలకొలది వున్నారు. 
దైవకార్యముకాని, తన వ్యక్తిగత కార్యముకానీ మానవుడు తన బుద్ధి బలమునువాడి 
కర్తవ్యమును నిర్వర్తించవలెను. ఇట్లు వసుదేవుడు తన బుద్ధిబలముచేతను,కాలము కలిసివచ్చుట చేతను తన కర్తవ్యమును నిర్వహించి తన భార్యను రక్షించుకొనెను. 
[జ్యోతిర్ శాస్త్రము తెలిసినవారికి ఇక్కడ ఇంకొక రహస్యముకూడా తెలియును ]

సరే, కంసుడు దేవకిని వదిలిపెట్టినాగూడా ,తన స్వభావంతోకూడిన భయముతో అనేక పాపకర్మలు  చేయుచునే ఉండెను.  కంసుడు మరణించుట అనునది కాలపురుషుని ప్రణాళికలో వకభాగము . ప్రణాళిక కాలపురుషునిది అయినను , కంసుడు తన మృతువును తా నే  ఆహ్వానించుకొనవలెను. దైవము కంసునిచేత పాపములు చేయించనక్కరలేదు. తనస్వభావమే 
కారణముగా కంసుడు పాపములు ఆచరిస్తాడు. వాణి స్వభావమే కాలపురుషుని పాశమై వానిని భాధించును. కాలపురుషుని ప్రణాళిక వక వైపునా ,వ్యక్తి స్వభావము మరివొకవైపునా ,
పడుగు ,పేకలుగా కాలమను వస్త్రము నేయబడుచుండును. [స్వ -భావము ను గురించి మనము 
పాతపాఠాలలొ చెప్పుకొన్నాము] యీ  సత్యము వక్కటే ఎన్నో సృష్టి రహస్యములను ,కాలస్వభావములోని రహస్యములను, మానవస్వభావములోని రహస్యములను,విప్పి చెప్పును . 
కృష్ణంవందే జగద్గురుమ్!
MASTER CVV NAMASKARAMS


srimadbhagavathamu 10thCANTO[contd] (6)




    శ్రీమద్భాగవతము దసమస్కందము {contd }(6)

"కాలము" అనే పదము మనముముందుపాఠాలలో వాడాము. కాలాన్ని గురించి పూర్తి అవగాహన
కావాలి అంటే మనము కంస, వసుదేవుల సంభాషణం లోని వసుదేవుని మనస్తత్వాన్ని పరిశీలించాలి. ఈ సంభాషణలోని  కాలమునుగూర్చిన రహస్య ప్రకాశాన్ని మన మాస్టరుగారు ఇట్లా ఇస్తారు. (ఇందులో పునర్జన్మ,కర్మసిద్దాంతము లకు  చక్కటి వివరణలు కూడా వున్నాయి. అవి ఇంకొకసారి చెప్పుకొందాము. )

కంసుడు ఆకాశవాణి మాటలు విని,ఉగ్రరూపుడయి ,ప్రాణభయంతో సోదరి అని కూడా ఆలోచించకుండా దేవకీదేవిని రధమునుండి క్రిందికి లాగి ఖడ్గముతో ఆమెను నరకబోతాడు. అప్పుడు దేవకీభర్తయైన వసుదేవుని  మనస్సులోని ఈక్రింది ఆలోచనలు కాలమును గూర్చి మనకు తెలియపరుస్తాయి.
నారాయణుని నుండి వెలువడిన మాయ (వ్యక్త స్వరూపమయిన అమ్మవారు లేక త్రిగుణాత్మకమయిన ప్రకృతి ) కాలముతో కలసి సృష్టిని ప్రారంబించింది అని చెప్పుకొన్నాము.
కాలములో వక ప్రణాళిక (shedule ) ఉంటుంది. ప్రణాళిక నిర్వహణ మాత్రమూ  మాయా శక్తి వలన జరుగుతుంది. ఈరెండు కలిసిన దానినే మనము కాలంగా గుర్తిస్తాము.
దీనినే దైవము అనికూడా అంటాము. (దేవుడు వేరు,దైవము వేరు . please మరిచిపోకండి. )
వక్కసారి ఈ కాలప్రణాళిక రూపొందిన తర్వాత దానిలో మార్పులుచేయుట ఎవ్వరికి సాధ్యముకాదు.
కంసుడు ఎంత బతిమలాడినను ఉగ్రరూపుడై ఉండుట గమనించిన వసుదేవుడు  కాలస్వభావమును స్మరించి ఇట్లు భావించెను. ప్రస్తుతము దేవకీ ప్రాణాపాయస్థితిలో వున్నది. ఆమెను రక్షించుట ప్రస్తుత కర్తవ్యము. ఎనిమిదవ గర్భమున పుట్టిన బిడ్డ వీనిని చంపునని ఆకాశవాణి  పలికిన మాటలు వింటినికదా! అది దైవము యొక్క వాక్కు. (కాలము)
అది జరుగవలెనన్న ఈమె బ్రతికిఉండవలెను. కనుక ఈమెను విడిపించుటకు ప్రయత్నము చేయుట మన కర్తవ్యము ,(I రిపీట్ ) కర్తవ్యము . అని భావించిన వసుదేవుడు "ఈమెకు పుట్టిన బిడ్డలనందరిని తెచ్చి నీకిచ్చదను . ఈమెను వదిలివేయుము. ",అని కంసుని నమ్మించి ,ఒప్పించి భార్యతోకలిసి ఇల్లుచేరేను. ( మిగతా తరువాతి పాఠములో )j
కృష్ణమ్ వందే జగద్గురుమ్ !

13, ఆగస్టు 2017, ఆదివారం




Sent from Yahoo Mail for iPad

Begin forwarded message:

On Thursday, May 25, 2017, 4:29 am, r.pidari@yahoo.com wrote:


Sent from my iPhone

Begin forwarded message:
From: "r.p.chandra sekar Babu" <rpcsbabu_48@yahoo.com>
Date: April 27, 2017 at 7:21:38 PM GMT+5:30
To: PIDURI RAJESWARA RAO <r.pidari@yahoo.com>
Subject: Bhagvadgita
Reply-To: "r.p.chandra sekar Babu" <rpcsbabu_48@yahoo.com>

9, ఆగస్టు 2017, బుధవారం

SRIMADBHAGAVATHAMU CONTO 10(CONTD) 5



   శ్రీగురుభ్యోనమః
అందరు బాగా చదివినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే చాల అనుమానాలు వస్తున్నాయి.
వక సోదరుని సందేహము.
ప్రశ్న:మనమందరము నరులమేకదా ?
           నరుడు అంటే దిగివచ్చిన నారాయణ ప్రజ్ఞ అని చెప్పారు. శ్రీకృష్ణుడు కూడా భూలోకంలో అవతరించిన మానవరూపముకదా? గోపగోపికలతో కలిసి ఆడాడు, పాడాడు . అయినప్పుడు మనకు,ఆయనకు   తేడా ఏమిటి?
మాస్టరుగారి సమాధానము :
         ఇది శ్రీకృష్ణుని జన్మ రహస్యమునకు సంబంధి Oచిన ప్రశ్న.
మనమందరము ఈ సృష్టిలో శరీరము ధరించిన నరునితత్వముగల జీవులం. మాయాశక్తి (అమ్మవారు) ఇస్రుష్టిని ప్రారంభించినపుడు ఆమెముందు నారాయణుని నుండి వెలువడి ,త్రిగుణములను స్వీకరించి,కాలముతోకలిసి సృష్టిని ప్రారంభించును. అంటే మనము త్రిగుణములకు లోబడి జీవిస్తూ ఉంటాము. మనము మనతల్లి గర్భమునుండి,త్రిగుణములతోకలసి,కాలము లేక దైవము అను తత్వము శరీరంలోపల ఉండగా ఈ సృస్టిలోకి వస్తాము. మరి శ్రీకృష్ణుని జన్మ విచిత్రము చూ డండి. అయన తల్లి కడుపునుండి ప్రసవించబడినచో ఆ  శరీరమునకు కొన్ని ప్రకృతి సంబంధ మయిన భౌతిక భందములు ఉండును. అట్లుగాక దేవకీదేవి ప్రసవించినంతనే చతుర్భాహుడయిన విష్ణుమూర్తి బాలుని వయస్సులో వున్న శ్రీహరి అయి వారికి  దర్శనమిచ్చెను. ఆ తరువాత ఆ దివ్యరూపము అంతర్ధానమయి పసిబాలుని శరీరము కనిపించెను. అంటే ఆ బాలుని శరీరము తల్లి గర్భములో
సమకూర్చుకున్న ధాతువుల స్థానములో దివ్యాణు వులతో నిర్మాణమయిన దివ్యధాతువులు
సమకూడి దివ్యరూపముగా మారెను.
అందువలననే బాలకృషుడు ప్రకృతిలో వున్న సమస్త భూతములపై ,జీవరాసులపై ,దేవతాగణములపై ఆధిపత్యము సాధించెను. ఉదాహరణకు పురిటికందుగా వున్నప్పుడే పూతన అను రాక్షసుని సంహరించుట మొదటి నిదర్శనము. శ్రీకృష్ణుడు పదమూడవ సంవత్సరము లోపలనే సర్వప్రకృతి పరిమితులకు అతీతుడుగా నిలిచి దివ్యకార్యములను సాధించెను.
ఇది సృష్టి ప్రణాళికలో వక భాగము.
అంటే శ్రీకృషునితో జీవించిన సహచరులు అందరు ప్రకృతికి లోబడినవారే (వక్క బలరాముడు తప్ప) శ్రీకృషుడు మాత్రమూ అవతార ప్రయోజనమునకై జీవిత కాలమంతయు దివ్యలీలా మయుడుగా జీవించిన /జీవించుచున్న అవతారమూర్తి.
శ్రీకృష్ణుడు ప్రకృతి ధర్మములకు పూర్తిగా అతీతుడు. మనము ప్రకృతి ధర్మములకు (సత్వ,రజస్సు,తమస్సు ) కట్టుబడిన వారము.
ఇది మ్మన మిత్రుని ప్రశ్నకు సమాధానము.
ఇది మన మాస్టరుగారు మనకు ప్రతిపాదించిన శ్రీకృషుని జన్మరహస్యము.
కృష్ణం వందే జగద్గురుమ్ !

3, ఆగస్టు 2017, గురువారం

SRIMADBHAGAVATHAMU 10TH SCANDAMU(contd) 4



శ్రీగురుభ్యోనమః!

శ్రీహరి (పరబ్రహ్మ,పరమాత్మ,నారాయణ ) కి రెండు రూపములు . వకటి పురుష స్వరూపము,రెండు కాలస్వరూపము. (క్రిందటి పోస్టులో చెప్పుకున్నాము )
మాయాశక్తి నారాయణుని అంశమును స్వీకరించి "నరతత్వమును రూపొందించును.( అసలు సృష్టి ప్రారంభములో యోగనిద్రలోనున్న నారాయణుని నుండి యోగమాయ వెలువడి ,కాలముతోకలిసి,త్రిగుణములను స్వీకరించి సృష్టిని  ప్రారంబించును.)
నరుడు అనగా దిగివచ్చిన నారాయణ ప్రజ్ఞ .
మరలనరులలో రెండు తత్వములు ఉండును.
శరీరమును ధరించిన నరుని తత్వ మును జీవుడు అందురు. ఆ శరీరము లోపల కాలమను తత్వము పనిచేయుచుండును. దానినే " దైవము" అని అందురు .
దైవము వేరు దేవుడు వేరు.
ఇప్పుడు వరసగా చుడండి
నారాయణుడు, నరుడు,జీవుడు,కాలము లెకదైవము
జీవుడు +దైవము =నరుడు  OR
 శరీరము +లోపలి కాలము లేక దైవము=నరుడు (దిగివచ్చిన నారాయణ ప్రజ్ఞ)
ఈ  కాన్సెప్ట్ పూర్తిగా అర్ధముచేసికోవాలి .

మాయాశక్తి అనే వకపదము వాడాము .. ఈమెయే వ్యక్త స్వరూపఅయిన  అమ్మవారు
నారాయణుడు అవ్యక్త స్వరూపుడు.
అమ్మ నారాయణుని అంశ స్వీకరించి ,కాలము మరియు త్రిగుణములతో కలిపి నరతత్వమును (సృష్టిని )రూపొందించును అని పైన చెప్పబడినది. CONFUSE కాకుండా మరల వక్కసారి
పైనించి క్రిందికి చదవండి.సృష్టి ఎలా వచ్చినదో అర్ధమవుతుంది.
స్వస్తి

2, ఆగస్టు 2017, బుధవారం

srimadbhagavathamu(contd) 3

శ్రీగురుభ్యోన్నమః

పరబ్రహ్మ,పరమాత్మ ,నారాయణ,శ్రీహరి, నరుడు,జీవుడు,దేవుడు,దై వము,కాలము,అనేపదాలు మనము అనేకసార్లు వినివుంటాము. వాడికూడా  ఉంటాము.,మనసంభాషణలో. వీటి అర్ధాల అసలు స్వరూపము  మనము తెలుసుకొంటే సృష్టిరహస్యము కొంత మనకు తెలుస్తుంది.

శుకయోగీంద్రుడు,పరీ క్షి త్తు యొక్క సంభాషణగా భాగవతము మనకు ఇవ్వబడింది.
శ్రీకృషుడు,అర్జునుడు సంవాదమే భగవద్గీత. మరి అర్జునుడు,పరీక్షిత్తు భగవత్ తత్వము తెలియనివారుకారు. వారిద్వారా మనకు తెలియపరచడానికే ఈ సంభాషణలయొక్క ఉద్యేశ్యము అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు వేసే ప్రశ్నలనుబట్టే మనము ఉహించవచ్చును. దసమscandamu ప్రారంభములోనే పరీక్షిత్తు సుకునితో వక ప్రశ్న వేస్తాడు. దాంతోనే మనకు అర్థమయిపోతుందిప్రశ్న ఇలాగ ఉంటుంది.
"శ్రీహరికి రెండురూపములు వున్నవి. వకటి పురుషస్వరూపము, రెండవది కాలస్వరూపము.
పురుషమూర్తి మానవులను సంసారబంధములో ఇరికించును. కాలస్వరూపము సంసారబంధమునుండి విముక్తిని ప్రసాదించును. అట్టి శ్రీహరి చరిత్రను వివరింపుము. "అని
కోరుతాడు. ఈ చిన్ని ఆటవెలది పద్యముద్వారా పోతనగారు శ్రీకృషుని వైభవమును మనకు వ్యక్త పరుస్తాడు. దీనికి మన మాస్టరుగారు మనకిచ్చిన రహస్యవ్యాఖ్యానము next పోస్ట్ లో చూద్దాము.
స్వస్తి!

sreemadbhagavathamu(cont) 2

శ్రీగురుభ్యోనమః

మనము అందరమూ ఎప్పుడో వొకప్పుడు భాగవతము చూచి/చదివే ఉంటాము. అందులోను దశమస్కంధము . ఆపేరు వినగానే మన మనసుకు వచ్చేవి శ్రీకృష్ణుని జన్మ విచిత్రము,స్వామివారి రాక్షస సంహారము,దుడుకు చేష్టలు,కాళీయ మర్దనము,గోపికా వస్త్రాపహరణము,కంసునివధ ,రుక్మిణీకల్యాణము,శమంతకమణి కధ ,నరకాసురవధ ,శ్రీకృష్ణతులాభారము,పాండవుల అ రణ్యవాసము, మాయాబజార్ ,శ్రీకృష్ణరాయభారము,
కురుక్షేత్రము-భగవద్గీత ,కుచేలునిపరిచయము,సుభద్రా పరిణయము ,మొదలైనవి. కానీ
మాస్టరుగారు తన రచనలో మనకందించినది ఈ సన్నివేశములలోని రహస్యములను. అవి మనము తెలుసుకుంటూ ఉంటే ,మనకు కలిగే ది  ఆత్మానుభూతి, మన ప్రశ్నలక సమాధానము . అందుకనే ఈ చిన్ని ప్రయత్నమూ.