15, మే 2017, సోమవారం

Sadhana(contd)



సాధన

సాధనలో భౌతికముగాగాని ,మనస్సతోగాని దిక్కులు చూడరాదు . శ్వాసను స్మరించునపుడు నాసికాగ్రమును స్మరించవలెను  అచ్చటనుండి  శ్వాసతో లోనికి పోవుట,వచ్చుటలతో ప్రాణాయామమేర్పడును.

మనస్సు  శ్వాశయందు నిలుచుటలో  ప్రత్యాహార మేర్పడును. మనస్సు,శ్వాస  ఏక మగుటతో  ధారణ మేర్పడును.  బాహ్యము,అంతరము అను ప్రజ్ఞలు కరగి కలసి పోవుటతో అంతర్యామిత్వము ఏర్పడును. ఇదియే ధ్యాన స్థితి . ఆ స్థితిలో  సర్వకార్యములు ఆచరింపబడుటలో సమాధిస్థితి ఏర్పడును.

మనకు తెలిసిన యమ ,నియమములు వీటితో జతచేసిన పతంజలి మహర్షి మనకందించిన అష్టాంగయోగము
మనకు పరిచయమము కాగలదు .
(ఇంద్రియములను శిక్షణ పెట్టుట---యమము . మనస్సును శిక్షణ పెట్టునది  నియమము )
ఈస్థితిలో ప్రశాంతమయిన ఆత్మస్థితి ఉండును .

From
MANDRAGEETHA BY MASTER E K
NAMASKARAMS MASTER

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి