నమస్కారములు .Rao గారి రెండవ ప్రశ్న
కోపము ,దుఃఖము కలగడానికి కారణాలు ఏమిటి?అవి కలిగేది మనస్సుకా,బుద్ధికా?
కోరికలు మూర్తీభవించిన ఇంద్రియాలు (desires are objectified indriyas ). ఇంద్రియములు మనస్సు యొక్క కిటికీలు . మనస్సు కంటి ద్వారా చూస్తుంది ;చెవి ద్వార వింటుంది;ముక్కు ద్వార వాసన చూస్తుంది . నాలుక ద్వారా రుచి చేలిసికొంటు0ది ;చర్మము ద్వారా స్పర్శను పొందుతుంది .
మనస్సును ఆరవ ఇంద్రియముగా పిలుస్తారు . (sixthsence ). తత్వాన్ని గురించి మాట్లాడుకున్దేటప్పుడు కామము అంటే కోరికలు అని అర్థము . కోరికలు తీరితే మోహము పెరుగుతుంది; తీరకపోతే repeat తీరకపోతే క్రోధము లేక కోపము ఏర్పడుతుంది ;మద మాశ్చర్యము లకు ,ఈర్ష్యా,ద్వేషాలకు దారి తీస్తాయి . ఈ negativefactors వల్ల
మనొదౌర్బల్యము కలుగుతుంది . మనోదుర్బలత్వము దుఖ్హానికి కారణమవుతుంది . (అర్జునుడు మనకు ఉదాహరణ ). కాబట్టి కోపానికి,దుఖానికి కారణము కోరికలు . ఆ కోరికలకు seat మనస్సు .
మనస్సు objectivity తో (బయటి పరిసరాలతో) react కావడం వల్లదాని adverse effect మన ప్రాణమయ, భవుతిక శరీరాల ఫై వకేసారి పడుతుంది . గాలి ఎక్కువగా పీల్చు కొంటాము ,కళ్ళకు నీళ్ళు వస్తాయి . దీనికి కారణము మనస్సు యొక్క abberations దాని కిటికీలు అయిన ఇంద్రియాలపై పడడము వల్ల.
కోపానికి ,దుఖానికి కారణము కోరికలు . కోరికలకు కారణము మనస్సు .
బుద్ధి ఎప్పుడు నిర్మలంగాను,స్వచ్చంగానూ వుంటుంది .. అందుకే మనము మనస్సును బుద్ధిలోకి లయం చేసి
బుద్ధి ఇచ్చే directions follow కావాలి.
భగవానుడు శ్రీకృషుడు భగవద్గీత ప్రారంభం "కశ్మలం " అనే పదం తో మొదలు పెడతాడు . (chap 2,slaoka 2)
కశ్మలం అంటే మనస్సు వ్యాకులత్వము . భగవద్గీత మొత్తము మనస్సు,బుద్ధి అనే పదాలతోనే నడుస్తుంది .
అందుకే భగవద్గీత కు మనోవిజయము అనే మరో పేరు కూడా వుంది .
మనస్సును జయించినవాడు స్థితప్రజ్ఞుడు .
MASTER CVV NAMASKARAMS
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి