14, ఫిబ్రవరి 2015, శనివారం

Rao gaari rendava prasna




నమస్కారములు .Rao  గారి రెండవ ప్రశ్న
కోపము ,దుఃఖము  కలగడానికి కారణాలు ఏమిటి?అవి కలిగేది మనస్సుకా,బుద్ధికా?
కోరికలు మూర్తీభవించిన ఇంద్రియాలు  (desires are objectified indriyas ). ఇంద్రియములు మనస్సు యొక్క కిటికీలు . మనస్సు కంటి ద్వారా చూస్తుంది ;చెవి ద్వార వింటుంది;ముక్కు ద్వార వాసన చూస్తుంది . నాలుక ద్వారా రుచి చేలిసికొంటు0ది ;చర్మము ద్వారా స్పర్శను పొందుతుంది .
మనస్సును ఆరవ ఇంద్రియముగా పిలుస్తారు . (sixthsence ). తత్వాన్ని గురించి మాట్లాడుకున్దేటప్పుడు కామము అంటే కోరికలు అని అర్థము . కోరికలు తీరితే  మోహము పెరుగుతుంది; తీరకపోతే  repeat తీరకపోతే  క్రోధము లేక కోపము ఏర్పడుతుంది ;మద మాశ్చర్యము లకు ,ఈర్ష్యా,ద్వేషాలకు దారి తీస్తాయి . ఈ negativefactors వల్ల
మనొదౌర్బల్యము కలుగుతుంది . మనోదుర్బలత్వము దుఖ్హానికి కారణమవుతుంది . (అర్జునుడు మనకు ఉదాహరణ ). కాబట్టి కోపానికి,దుఖానికి కారణము కోరికలు .  ఆ కోరికలకు seat మనస్సు .
మనస్సు objectivity తో (బయటి పరిసరాలతో) react కావడం వల్లదాని adverse effect మన ప్రాణమయ, భవుతిక శరీరాల ఫై వకేసారి పడుతుంది . గాలి ఎక్కువగా పీల్చు కొంటాము ,కళ్ళకు నీళ్ళు వస్తాయి . దీనికి కారణము మనస్సు యొక్క abberations  దాని కిటికీలు అయిన ఇంద్రియాలపై  పడడము వల్ల.
కోపానికి ,దుఖానికి కారణము కోరికలు . కోరికలకు కారణము మనస్సు .
బుద్ధి ఎప్పుడు నిర్మలంగాను,స్వచ్చంగానూ వుంటుంది .. అందుకే మనము మనస్సును బుద్ధిలోకి లయం చేసి
బుద్ధి ఇచ్చే directions follow కావాలి.
భగవానుడు శ్రీకృషుడు భగవద్గీత ప్రారంభం "కశ్మలం " అనే పదం తో మొదలు పెడతాడు . (chap 2,slaoka 2)
కశ్మలం అంటే మనస్సు వ్యాకులత్వము . భగవద్గీత మొత్తము మనస్సు,బుద్ధి అనే పదాలతోనే నడుస్తుంది .
అందుకే భగవద్గీత కు మనోవిజయము అనే మరో పేరు కూడా వుంది .
మనస్సును జయించినవాడు స్థితప్రజ్ఞుడు .
MASTER CVV NAMASKARAMS

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి